
‘విలన్’ పరాజయంతో పట్టువదలని విక్రమార్కుడిలా..తమిళ రచయిత కల్కీ కృష్ణమూర్తి రచించిన..ఫేమస్ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా మణిరత్నం రూపొందిస్తున్న ఈ చిత్రంలో మహేష్ ని సెకండ్ హీరోగా సెలక్ట్ చేసుకుని, మహేష్ ని సంప్రదిస్తే..ఇంత వరకు మణికి మహేష్ బాబు ఏం చెప్పకుండా..విసిగించడంతో చేసేది లేక మణిరత్నం కూడా ఆ పాత్రను సూర్యకు కేటాయించినట్లుగా సమాచారం. ఇక వీరితో పాటు ఓ ప్రధాన పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్, హీరోయిన్ గా త్రిషను సెలక్ట్ చేశారని సమాచారం. అత్యంత భారీ స్థాయిలో ‘రోబో’ చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ ఈ భారీ చిత్రాన్ని దాదాపు 200కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది..శంకర్, మణిరత్నంలతో ఒక్క చిత్రం చేసినా చాలు అని నేటి హీరోలంతా అనుకంటుంటే..కోరి మరీ తన వద్దకు వచ్చిన ఈ అగ్ర దర్శకులతో అవకాశంను..ప్రిన్స్ ఎందుకు కాదనుకుంటున్నట్లో...